అచ్చంపేట రూరల్, ఏప్రిల్ 28: అచ్చంపేట మున్సిపల్ ఎన్నికలు 30న నిర్వహించనున్నారు. మున్సిపాలిటీలోని 20 వార్డులకుగానూ అధికారులు 40 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేశారు. ఎన్నికల్లో ము న్సిపాలిటీలోని 10,428 మంది మహిళ లు, 10,100 మంది పురుషులు, ఇతరు లు 1 మొత్తం 20,529 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. సా యినగర్ కాలనీవాసులు అదే కాలనీలోని ఉన్నత పాఠశాలలో, దర్శన్గడ్డ కాలనీవాసులు పట్టణంలోని బాలుర జూనియర్ క ళాశాలలో, చింత్ బస్తీ కాలనీవాసులు ఉ ర్దూ మీడియం పాఠశాలలో, గోకుల్నగర్ కాలనీ ఓటర్లు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో, మహేంద్రనగర్, ఇంద్రనగర్ కాలనీ ఓటర్లు మహేంద్ర నగర్ కాలనీలోని పాఠశాలలో, మధురానగర్, టీచర్స్కాలనీ, వెంకటేశ్వర కాలనీ, శి వసాయినగర్, మారుతీనగర్ కాలనీల ఓ టర్లు మున్సిపల్ కార్యాలయం సమీపంలో ని ఉన్నత పాఠశాలలో ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వలపట్ల, శ్రీరామ్నగర్ కాలనీల ఓటర్లు వలపట్ల పాఠశాల లో, చత్రపతి శివాజీనగర్, కుమ్మరివీధి ఓ టర్లు బాలికల కళాశాలలో, విద్యానగర్, మారుతీనగర్ కాలనీల ఓటర్లు బాలికల పా ఠశాలలో కేటాయించిన పోలింగ్ కేంద్రాల లో ఓటుహక్కును వినియోగించుకోవాలని ఎన్నికల అధికారులు సూచించారు.