‘అన్నియన్'(తెలుగులో ‘అపరిచితుడు’) చిత్ర హిందీ రీమేక్ హక్కుల విషయంలో దర్శకుడు శంకర్, తమిళ నిర్మాత రవిచంద్రన్ మధ్య మొదలైన వివాదం మరింత రాజుకుంటోంది. ఈ రీమేక్ను నిలిపివేయాలంటూ దర్శకుడు శంకర్, హిందీ నిర్మాత జయంతీలాల్ గదలపై రవిచంద్రన్ కేసు వేయబోతున్నట్లు తెలిసింది. విక్రమ్ కథానాయకుడిగా 2005లో శంకర్ దర్శకత్వంలో రూపొందిన ‘అన్నియన్’ చిత్రం కమర్షియల్గా పెద్ద విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాను రణ్వీర్సింగ్తో హిందీలో రీమేక్ చేయబోతున్నట్లు ఇటీవల శంకర్ ప్రకటించారు. ఈ రీమేక్ విషయంలో సర్వహక్కులు తనకే ఉన్నాయని నిర్మాత రవిచంద్రన్ అంటున్నారు. చిత్ర కథ తన సొంతమని, శంకర్ కేవలం దర్శకత్వ బాధ్యతల్ని మాత్రమే చేపట్టారని ఆయన చెబుతున్నారు. ఈ వివాదంపై ఇప్పటికే సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ను రవిచంద్రన్ ఆశ్రయించారు. తాజాగా ఆయన మద్రాస్ హైకోర్టులో శంకర్తో పాటు హిందీ నిర్మాతపై కేసు వేయబోతున్నట్లు తెలిపారు. ఈ రీమేక్ విషయంలో నిర్మాతతో తప్ప శంకర్తో తాను చర్చించాల్సిందేమీ లేదని రవిచంద్రన్ పేర్కొన్నారు.