దర్శకరత్న దాసరి నారాయణరావు తనయులపై పోలీసు కేసు నమోదైనట్లు తెలుస్తుంది. ఈ విషయం ప్రస్తుతం టాలీవుడ్లో సంచలనం రేపుతున్నది. దాసరి పోయినప్పటి నుంచి కూడా ఈయన కుటుంబం అప్పుడప్పుడూ వార్తల్లో ఉంటూనే వస్తుంది. పైగా వివాదాలు కూడా బాగానే చుట్టుముడుతున్నాయి. మరీ ముఖ్యంగా ఆస్తి విషయాలతోనే ఎక్కువగా దాసరి కుటుంబం హెడ్ లైన్స్లోకి వస్తుంది. తాజాగా మరోసారి ఇదే జరిగింది. ఇప్పుడు దాసరి నారాయణరావు కొడుకులు దాసరి అరుణ్ కుమార్, ప్రభులపై కేసు నమోదవ్వడం చర్చనీయాంశం అయింది. అప్పుతీర్చమని కోరినందుకు.. చంపేస్తామంటూ బెదిరించారని వీరిపై హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైనట్లు తెలుస్తున్నది.
అసలు విషయం ఏంటంటే.. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా వాసి అయిన అట్లూరి సోమశేఖర్ రావు ఎల్లారెడ్డిగూడలో ఉంటాడు. దాసరి నారాయణరావుకు ఈయన అత్యంత సన్నిహితుడు. దాసరి ఉన్న రోజుల్లో.. ఆర్థిక పరిస్థితి బాగోలేనపుడు సోమశేఖర్ రావు నుంచి రూ.2.10 కోట్లు అప్పుగా తీసుకున్నారని తెలుస్తుంది. అయితే ఆ అప్పు తీర్చకుండానే 2017లో దాసరి కన్నుమూశారు. ఈ క్రమంలో సోమశేఖర్ రావుకు రూ.2.10 కోట్లకు బదులు రూ.1.15 కోట్లు చెల్లించేందుకు 2018 నవంబర్ 13న పెద్దల సమక్షంలో దాసరి కుమారులైన దాసరి ప్రభు, అరుణ్ కుమార్ ఒప్పుకున్నారు. కానీ వాళ్లు ఆ మాట నిలబెట్టుకోలేదని తెలుస్తోంది. దీంతో జూలై 27న జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్ 46లోని దాసరి ఇంటికి సోమశేఖర్ వెళ్లి డబ్బులు అడిగారు. ఈ క్రమంలో మరోసారి డబ్బు కోసం ఇంటికి వస్తే చంపేస్తామని దాసరి కుమారులు బెదిరించారని సమాచారం. అందుకే ఆయన ప్రభు, అరుణ్పై పలు సెక్షన్ల కింద కేసు పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
సర్కారు వారి పాటలో మహేశ్ లుక్ వచ్చేసింది.. సూపర్ స్టార్ బర్త్ డేకి మరో బ్లాస్టర్
నారప్ప సక్సెస్మీట్లో నోరు జారిన వెంకటేశ్.. ఎఫ్ 3 విడుదలపై క్లారిటీ
Review : తిమ్మరుసు సినిమా ఎలా ఉందంటే..
Samantha | అభిమానులకు షాక్.. సోషల్ మీడియాలో అక్కినేని పేరు తీసేసిన సమంత
ప్రభాస్ ఫ్యాన్స్కు గుడ్న్యూస్.. మూడు నెలల గ్యాప్లో రెండు సినిమాలు