అమరావతి: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విటర్ వేదికగా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ‘ఈ ‘వారం రోజుల సీఎం కుర్చీ’ పగటి కల ఏంటి చంద్రబాబు? జనం నవ్వుకుంటారన్న ఇంగితం కూడా లేదు. 14 ఏళ్లు సీఎంగా ఉండి పొడిచింది ఏముంది? ఏ స్కీమ్ వల్లనైనా ప్రజల జీవన ప్రమాణాలు పెరిగాయని గుండె మీద చేయి వేసుకొని చెప్పగలవా? ప్రజలను దోచుకున్నందుకేగా నీకు సున్నం బొట్లు పెట్టి ఇంటికి పంపించిందని’ విజయసాయిరెడ్డి విమర్శించారు.
‘తుఫాన్లు వచ్చి ప్రజలు నిరాశ్రయులై, సర్వం కోల్పోతే మంచి నీళ్లతో సహా హెరిటేజ్ సరుకులను అమ్ముకున్న నీచ చరిత్ర బాబుది. సముద్రాన్ని కంట్రోల్ చేసా, తుఫానును దారి మళ్లించా అని కాకమ్మ కబుర్లు చెబితే నమ్మే రోజులు కాదు బాబూ. మంత్ర దండం ఏదైనా ఉంటే కుప్పంలో ఒక్క రోగి లేకుండా చేయొచ్చుగా.’ అని విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు.