ప్రపంచ అతిపెద్ద ఫిలిం ఫెస్టివల్ గా పేరొందిన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ప్రతీ ఏడాది మే నెలలో జరుగుతుందని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అయితే కరోనా మహమ్మారి విజృంభణతో గతేడాది ఈ కార్యక్రమం రద్దయింది. ఈ ఏడాది జూలై 6 నుండి జూలై 17 వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. 74వ కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో భాగంగా బ్రిటన్ బ్యూటీ అమీ జాక్సన్ రెడ్ కార్పెట్పై హోయలు పోయింది.సౌత్ సినిమాలలో తన అందచందాలతో అలరించిన అమీ జాక్సన్ మదరాసు పట్టణం అనే సినిమాలో ఆర్య పక్కన హీరోయిన్ గా వెండితెరకు పరిచయమైంది. అప్పటి నుంచి ఆమె చేసిన వాటిలో క్రేజీ ప్రాజెక్టులే ఎక్కువ. తెలుగులో కూడా ‘ఎవడు’ సినిమాలో చరణ్ పక్కన రెండో హీరోయిన్ గా చేసింది.
సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే అమీ జాక్సన్ కేన్స్ ఫిలిం ఫెస్టివల్ కు వెళ్లిన సమయంలో దిగిన ఫొటోలని షేర్ చేసింది. చాలా ట్రెండీ లుక్లో కనిపిస్తున్న అమీని చూసి ఏమందం సుమీ నీది అంటూ కామెంట్స్ పెడుతున్నారు. దర్శకుడు శంకర్ తీసిన ‘ఐ’ సినిమాతో టాప్ యాక్ట్రస్ స్థాయికి చేరాలన్న అమీ జాక్సన్ ఆశకు గండిపడింది. కానీ శంకర్ ఆమెకు మరో ఛాన్స్ ఇస్తూ రోబో సీక్వెల్ 2.0 లో రజనీకాంత్ పక్కన హీరోయిన్ గా తీసుకున్నాడు. ఈ సినిమా కూడా తన కెరీర్కు ఏ మాత్రం ఉపయోగపడలేదనే చెప్పాలి. అయితే ఒక బిడ్డకు తల్లైనా కూడా అమీ గ్లామర్ చెక్కు చెదరలేదనే చెప్పాలి. గత కొన్నేళ్లుగా జార్జ్ పనాయిటోయ్తో అమీ సహజీవనం చేస్తుండగా.. వీరిద్దరికి 2019లో ఒక బాబు కూడా జన్మించాడు. అప్పటినుంచి బాబు కోసమే ఎక్కువ సమయాన్ని కేటాయిస్తూ వస్తుంది అమీ.