జనగామ రూరల్, ఏప్రిల్ 4 : మండలంలోని పెంబర్తి గ్రామంలో రెండు రోజులుగా కొన సాగుతున్న దుర్గామాత ఉత్సవాలు ఆదివారం ముగిశాయి. ఉదయం అమ్మవారికి గ్రామస్తులు ప్రత్యేక పూజలు చేసి యాటలు, కోళ్లు బలిచ్చారు. మరికొందరు బోనాలతో మొక్కులు చెల్లించారు. ఈ సంవత్సరం పాడి పంటలతో ప్రజలు ఆనం దంగా ఉండాలని అమ్మ వారిని వేడుకు న్నారు. దుర్గామాత ఉత్సవాల సం దర్భంగా సర్పంచ్ అంబాల ఆంజనేయులు ఆలయం వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. గ్రామంలో మంచినీటి పైపులైన్ దెబ్బతినడంతో ప్రజలు ఇబ్బందిపడకుండా వాట ర్ ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేశారు. ఈ నేపథ్యంలో గ్రామస్తులు వ్యవసాయ బావుల వద్దకు వన భోజనాలకు తరలివెళ్లారు. కులమతాలకు అతీతంగా పండుగను ఘ నంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ జిల్లా నాయకుడు బాల్దె సిద్ధిలింగం, ఎంపీటీసీ మూల రవి, ఉప సర్పంచ్ చినబోయిన రేఖారాజు, వార్డు సభ్యులు సంకటి యాదగిరి, గంగరబోయిన కవితా కరుణాకర్, బండ కవిత, ఆకుల శ్రీలతాశ్రవణ్, రేపాల కోటేశ్వర్రావు, ఎండీ ఇబ్రహీం, కూర రాజు, పంపర మల్లేశం, మల్యాల శ్రీలత, ఎంబరి హనుమంతరావు, దుర్గాచలం, సుధాకర్, నర్సమ్మ పాల్గొన్నారు.
ఇవి కూడా చూడండి..
కరోనా ఎఫెక్ట్ : బీహార్లో వారంపాటు విద్యాసంస్థల మూసివేత
రైతుల ప్రాణ త్యాగాలు వృథా కాకుండా చూస్తాం: కేజ్రీవాల్