పీవీ శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకుని ఆదర్శనగర్లోని బిర్లా సైన్స్ సెంటర్ ప్రాంగణంలోని భాస్కర్ ఆడిటోరియంలో వివిధ రంగాల్లో నిష్ణాతులైన పలువురికి ‘మన తెలుగుతేజం’ అవార్డుల ప్రదానోత్సవం అక్షరదీక్ష సాహిత్య కళావేదిక ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం ఘనంగా జరిగింది. ప్రముఖ సాహితీవేత్త వేణుసంకోజు అధ్యక్షతన జరిగిన ఈ సభలో పీవీ కుమారుడు పీవీ ప్రభాకరరావు, పీవీ సోదరుడి కుమారుడు పీవీ మదన్మోహన్, మనవలు పీవీ కశ్యప్, ఎన్వీ సుభాష్, సభ సమన్వయకర్త పి.వెంకటరమణ గుప్తా తదితరులు పాల్గొని పీవీ వ్యక్తిత్వాన్ని కొనియాడారు. పీవీ పేరిట పురస్కారాలు అందుకున్న వారు సమాజానికి తమవంతు సేవలు అందించాలని సూచించారు.