దేవరాజ్ హీరోగా నటిస్తూ నిర్మించిన చిత్రం ‘బుల్లెట్ సత్యం’. మధుగోపు దర్శకుడు. సోనాక్షివర్మ కథానాయికగా నటించింది. ఈ నెల 10న విడుదలకానుంది. ట్రైలర్ను సీనియర్ నటుడు వినోద్కుమార్ విడుదలచేశారు. దర్శకుడు మాట్లాడుతూ ‘గ్రామీణ నేపథ్యచిత్రమిది. రాజకీయ చదరంగంలో ఓ యువకుడికి ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయన్నది ఉత్కంఠను పంచుతుంది’ అని తెలిపారు. పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కించామని దేవరాజ్ అన్నారు.