ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్
మేడిపల్లి, జూన్ 6 :వరదకాలువతో మేడిపల్లి, కథలాపూర్ మండలాలు సస్యశ్యామలమవుతాయని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ స్పష్టం చేశారు. ఈ రెండు మండలాల్లోని గ్రామాల ద్వారా వరదకాలువ వెళ్తున్నదని, వరదకాలువకు ఎగువన ఉన్న గ్రామాల్లోని చెరువులను లిప్టు ద్వారా నింపడంతో రెండు పంటలు సమృద్ధిగా పండుతాయని చెప్పారు. ఈ మేరకు ఆదివారం జగిత్యాల జిల్లా మేడిపల్లి, కథలాపూర్, మెట్పల్లి మండలాల్లో పర్యటించిన ఆయన, పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయాచోట్ల మాట్లాడారు.
మేడిపల్లి, కథలాపూర్ మండలాల్లోని గ్రామాల ద్వారా వరదకాలువ వెళ్తున్నదని, వరదకాలువకు ఎగువన ఉన్న గ్రామాల్లోని చెరువులను లిప్టు ద్వారా నింపడంతో మేడిపల్లి, కథలాపూర్ మండలాలు సస్యశ్యామలమవుతాయని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్ పేర్కొన్నారు. మేడిపల్లి మండలంలోని కాచారం గ్రామంలో వినోద్కుమార్ విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం సాధించడంతోపాటు రాష్ట్రం అభివృధ్ధిలో అగ్రస్థానంలో నిలిచిందని తెలిపారు. నాణ్యమైన విద్యుత్ను సరఫరా చేయడంతోపాటు రైతుబంధు, రైతుబీమా పథకాలను ప్రవేశపెట్టి రైతు కుటుంబానికి భరోసా ఇచ్చారని స్పష్టం చేశారు. అనంతరం వినోద్కుమార్ను శాలువాతో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు అంకం విజయసాగర్ సన్మానించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ ఉపాధ్యక్షుడు వొద్దినేని హరిచరణ్రావు, మాజీ మార్క్ఫెడ్ చైర్మన్ లోక బాపురెడ్డి, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు వంగ వెంకటేశం, సర్పంచులు కాచర్ల సురేశ్, ద్యావనపెల్లి అభిలాష్, ఈర్నాల సంపత్కుమార్, చిట్యాల సురేశ్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు అంకం విజయ సాగర్, నాయకులు నాంచారి రాజేందర్, వెల్మ నవీన్రెడ్డి, సుధవేని గంగాధర్, కాటిపెల్లి శ్రీపాల్రెడ్డి, కొప్పెర లింగారెడ్డి, కొండ కిషన్ తదితరులు పాల్గొన్నారు.