న్యూఢిల్లీ: కరోనా టీకా డోసులను సరిపడా అందుబాటులో ఉంచేందుకు నిబద్ధతతో ఉన్నామని ప్రధాని నరేంద్రమోదీ తెలిపారు. దేశంలో ఇప్పటికే 10 కోట్ల మందికి టీకా వేశారని, వేగంగా ఈ మైలురాయిని దాటిన దేశం మనదేనని చెప్పారు. గత నాలుగు రోజుల్లో ‘టీకా ఉత్సవ్’తో వ్యాక్సినేషన్ కార్యక్రమం విస్తరించిందని పేర్కొన్నారు. కరోనాను కట్టడి చేయడంలో గత ఏడాది కనిపించిన ప్రజల భాగస్వామ్యం ఇప్పుడు కూడా అవసరమని, ఇందులో గవర్నర్ల పాత్ర కీలకమని చెప్పారు.