న్యూఢిల్లీ: భారత-ఎ జట్టుకు కోచ్గా ఉన్నప్పుడు జట్టులో ప్రతి క్రికెటర్కు ఆడే అవకాశాన్ని ఇచ్చేవాడిని అని టీమ్ఇండియా మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ అన్నాడు. జట్టుకు ఎంపికైన తర్వాత మ్యాచ్ ఆడకుండా బెంచ్పై కూర్చుంటే ఎలా ఉంటుందో తనకు తెలుసని పేర్కొన్నాడు. ‘ఎంపికైన వారందరికీ జట్టులో చోటు ఇస్తానని ముందే చెబుతా. చిన్నతనంలో ఒకసారి నేను జట్టుకు ఎంపికైనా.. ఆడే అవకాశం రాలేదు. అది భయంకరమైన పరిస్థితి. అలాంటి చేదు అనుభవం ఎవరికి ఎదురు కాకూడదని జట్టులో ఉన్న అందరికీ ఆడే అవకాశం కల్పిస్తా’ అని ద్రవిడ్ శుక్రవారం చెప్పాడు. వచ్చే నెలలో శ్రీలంకతో జరుగనున్న పరిమిత ఓవర్ల సిరీస్కు టీమ్ఇండియా ప్రధాన కోచ్గా రాహుల్ ద్రవిడ్ నియమితమైన సంగతి తెలిసిందే.