వన్ నేనొక్కడినే, దోచెయ్ చిత్రాలతో తెలుగు ఆడియెన్స్ కు పరిచమైంది ఢిల్లీ భామ కృతిసనన్. ప్రస్తుతం హిందీలో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ బిజీ హీరోయిన్ల లిస్టులో చేరిపోయింది. నెట్టింట్లో చురుకుగా ఉండే ఈ సైజ్ జీరో బ్యూటీ తాజాగా పోస్ట్ చేసిన స్టిల్స్ నెటిజన్లకు కంటి మీదు కునుకు లేకుండా చేస్తున్నాయి.
టోఫీ కలర్ డ్రెస్లో స్లీవ్లెస్ టాప్ లో గాలికి ఎగురుతున్న కురులతో కెమెరాకు స్టన్నింగ్ గా ఫోజులిచ్చింది కృతి. చాకోలెట్ కలర్ లో ముగ్దమనోహరమైన సౌందర్యంతో కళ్లు పక్కకు తిప్పుకోకుండా చేస్తోంది. ఇన్ స్టాగ్రామ్ లో ఫొటోలు పోస్ట్ చేసిన గంట వ్యవధిలోనే 604కే లైక్స్ వచ్చాయి. ప్రస్తుతం అక్షయ్ కుమార్ తో కలిసి బచ్చన్ పాండే చిత్రంలో నటిస్తోంది కృతిసనన్.
అమర్ కౌశిక్ డైరెక్షన్లో వస్తున్న హార్రర్ కామెడీ భెడియాలో నటిస్తోంది. వరుణ్ ధవన్ మెయిన్ లీడ్ రోల్ చేస్తున్నాడు. కృతిసనన్ ప్రధాన పాత్రలో నటించిన మిమి చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఇవి కూడా చదవండి..
కాజల్-గౌతమ్ ఏం చేస్తున్నారో చూడండి
అలియాబట్ ఆర్ఆర్ఆర్ పాటలో జాయిన్ అయ్యేదెప్పుడంటే..?
పవన్-రానా మల్టీస్టారర్ లో భారీ మార్పు..?
వెయిట్ లిఫ్టర్ లా సారా అలీఖాన్..వీడియో హల్చల్
నారప్ప, దృశ్యం 2..డీల్ ఏంతో తెలిస్తే షాకే..!
తెరపైకి ‘దర్శకరత్న’ దాసరి బయోపిక్..వివరాలివే..!