మార్కుల విధానాన్ని ప్రకటించిన బోర్డు
న్యూఢిల్లీ, మే 1: కరోనాతో పదో తరగతి బోర్డు పరీక్షలు రద్దయిన నేపథ్యంలో విద్యార్థులకు మార్కులు వేసే విధానాన్ని సీబీఎస్ఈ శనివారం ప్రకటించింది. ఫలితాలను జూన్ 20వ తేదీలోపు ప్రకటిస్తామని వెల్లడించింది. సీబీఎస్ఈ పరీక్షల కంట్రోలర్ సన్యం భరద్వాజ్ తెలిపిన వివరాల ప్రకారం… ప్రతి ఏడాదిలాగే సబ్జెక్టుకు 20 మార్కుల చొప్పున ‘ఇంటర్నల్ అసెస్మెంట్’కు కేటాయిస్తారు. ఏడాది మొత్తం నిర్వహించిన పరీక్షల్లో విద్యార్థులు ప్రదర్శించిన ప్రతిభ ఆధారంగా 80 మార్కులకు ఎన్ని మార్కులు ఇవ్వాలనేది నిర్ణయిస్తారు. పాఠశాలలు కేటాయించే మార్కులు గత ఏడాది అవి సాధించిన ఫలితాలకు అనుగుణంగా ఉండాలి. పాఠశాలలు అక్రమాలకు పాల్పడితే జరిమానా విధిస్తామని లేదా గుర్తింపు రద్దు చేస్తామని భరద్వాజ్ హెచ్చరించారు.