బాలీవుడ్ భామ దియామీర్జా సోషల్మీడియాలో యాక్టివ్గా ఉంటుందన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇటీవలే వైభవ్ రేఖితో ఏడడగులు వేసి వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది దియామీర్జా. పెండ్లి తర్వాత భర్త వైభవ్తో కలిసి మాల్దీవులు టూర్కు వెళ్లింది.
మాల్దీవుల్లోని అందమైన బీచ్లో బికినీ షూట్లో కెమెరాకు ఫోజులిచ్చింది. సరిగ్గా ప్యారడైజ్లో ఉన్నాం. ప్రతీ క్షణాన్ని ఆహ్లాదభరితంగా ఎంజాయ్ చేస్తూ..వైభవ్ తీసిన ఫొటోలతో అంటూ క్యాప్షన్ ఇచ్చింది. దియామీర్జా ప్రస్తుతం అక్కినేని నాగార్జున నటిస్తోన్న వైల్డ్ డాగ్లో నాగ్ భార్య ప్రియా వర్మగా నటిస్తోంది. ఏప్రిల్ 2న విడుదల కానుందీ చిత్రం.