ప్రసుతం కరోనా సెకండ్ వేవ్ ఉదృతంగా ఉన్న నేపథ్యంలో 45 ఏళ్లకు పైబడిన వారు వ్యాక్సిన్ వేసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. సెలబ్రిటీలు సైతం వ్యాక్సిన్ వేసుకుంటూ మీరందరు కూడా తప్పనిసరిగా టీకా వేసుకోవాలని సూచిస్తున్నారు. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు కరోనా టీకా తీసుకున్నారు. ఆదివారం రోజు టీకా తీసుకున్నఆయన మీరందకు కూడా తీసుకోండి. కోవిడ్ 19 సెకండ్ వేవ్ ప్రభావం ఎక్కువగా ఉంది. ఇది తీవ్రమైన ఇబ్బంది పెడుతుంది. 18 ఏళ్లు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు మే1వ తేదీ నుండి టీకా వేసుకోవడానికి అర్హులు. అందరూ టీకా వేయించుకోండి. ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఉండండి’ అంటూ మహేష్ ట్వీట్ చేశాడు.
గత ఏడాది సరిలేరు నీకెవ్వరు చిత్రంతో ప్రేక్షకులని పలకరించిన మహేష్ బాబు ప్రస్తుతం పరశురాం దర్శకత్వంలో సర్కారు వారి పాట అనే చిత్రాన్ని చేస్తున్నాడు. ఈ చిత్రం దుబాయ్ లో ఓ షెడ్యూల్ పూర్తి చేసుకోగా, తాజగా షెడ్యూల్ని హైదరాబాద్లో చిత్రీకరిస్తున్నారు. రామోజీ ఫిల్మ్ సిటీలో ఆర్ట్ డైరెక్టర్ తోట తరుణి ఆధ్వర్యంలో ప్రత్యేకమైన సెంట్రల్ బ్యాంక్ కి సంబంధించిన భారీ సెట్ ను నిర్మిస్తుండగా, ఇందులో షూటింగ్ జరగనుంది. మైత్రీ మూవీ మేకర్స్, జీ ఎమ్ బి ఎంటర్టైన్మెంట్ ,14 రీల్స్ ప్లస్ సంస్థలు చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తుంది.