పెళ్లి తర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చిన స్వాతిరెడ్డి భర్తతో ఇండోనేషియాలో సెటిలైంది. ఇప్పుడు మళ్ళీ ‘పంచతంత్రం’ తో టాలీవుడ్ రీఎంట్రీ ఇస్తోంది. ఇందులో పద్మశ్రీ బ్రహ్మానందం , సముద్రఖని, స్వాతి రెడ్డి, శివాత్మిక రాజశేఖర్, యువ హీరో రాహుల్ విజయ్, ‘మత్తు వదలరా’ ఫేమ్ నరేష్ అగస్త్య ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు.
టికెట్ ఫ్యాక్టరీ, ఎస్ ఒరిజినల్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని హర్ష పులిపాక తెరకెక్కిస్తున్నారు.తాజాగా ఈ చిత్రానికి సంబంధించి అప్ డేట్ ఇచ్చింది మూవీ టీమ్. మాకథకుడు రెడీ అంటూ బ్రహ్మానందం పోస్టర్ విడుదల చేసింది . రెండు మూడు దశాబ్దాల క్రితం మన పల్లెటూరి దేవాలయాల్లో పురాణ కథలు వల్లించే కథకులు ఉండేవారు. అలాంటి పాత్రలో బ్రహ్మానందం నటిస్తున్నాడు.
ఐదు భావేద్వేగాల మిళితమైన చక్కటి కథ పంచతంత్రం కాగా, యువతరం ఆలోచనలు, వాళ్ల దృక్పథాలకు అద్దం పట్టేలా కథ, కథనాలు సినిమాలో ఉంటాయి . చిత్రీకరణ దాదాపుగా పూర్తి కావొచ్చిన ఈ సినిమా ప్రోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. నవంబర్ లేదా డిసెంబర్ లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.