ఖుషీ కపూర్ ఎంట్రీపై బోనీ కపూర్ క్లారిటీ..!

శ్రీదేవి, బోనీ కపూర్ ముద్దల కూతుళ్లు జాన్వీ కపూర్, ఖుషీ కపూర్ ఎప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటారు. జాన్వీ ఇప్పటికే దఢక్ సినిమాతో వెండితెర ఎంట్రీ ఇవ్వగా, ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తుంది.ఇక రెండో కూతురు ఖుషీ కపూర్ విషయానికి వస్తే గత కొద్ది రోజులుగా ఆమె వెండితెర ఎంట్రీపై అనేక వార్తలు వస్తున్నాయి. దీనిపై తాజాగా ఆమె తండ్రి, నిర్మాత బోనీ కపూర్ క్లారిటీ ఇచ్చారు.
అతి త్వరలోనే ఖుషీ వెండితెర ఆరంగేట్రం చేస్తుందని చెప్పిన బోనీ కపూర్.. నా దగ్గర అన్ని అవకాశాలు ఉన్నప్పటికీ, మొదట మాత్రం నేను పరిచయం చేయను. తండ్రిగా ఖుషీ సొంతంగా ఎదగాలని కోరుకుంటున్నాను. అందుకే నేను ఆమె తొలి సినిమాని నిర్మించాలని అనుకోవడం లేదు అని పేర్కొన్నారు. ప్రస్తుతం లండన్లో ఫిలీం స్కూల్లో యాక్టింగ్ ట్రైనింగ్ తీసుకుంటున్న ఖుషీ అతి త్వరలోనే సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇస్తుందని సమాచారం.
తాజావార్తలు
- చిరు కోసం కథలు రెడీ చేస్తున్న ఇద్దరు యంగ్ డైరెక్టర్స్
- మంత్రి ఇంద్రకరణ్రెడ్డి దంపతులకు కొవిడ్ టీకా
- 'నాంది' రెండు వారాల కలెక్షన్లు ఎంతంటే..
- త్వరలో జియో లాప్టాప్.. చౌకగానే?!
- 'ఏం చేద్దామనుకుంటున్నావ్..వ్యవసాయం..'శ్రీకారం ట్రైలర్
- ఏసీబీ వలలో మన్నెగూడ సర్పంచ్
- మాస్కులు లేనివారి నుండి డబ్బులు వసూలు.. నకిలీ పోలీసు అరెస్టు
- 30 రోజుల్లో 2 సినిమాలు రిలీజ్ చేయడమెలా..?
- మేమంతా టీఆర్ఎస్ వెంటే..తువగడ్డ తండా గిరిజనులు
- విజయ్మాల్య అప్పగింత డౌటే.. బ్రిటన్ ఏమందంటే?!