సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు ఒక్కొక్కరిగా కన్ను మూస్తుండడం కలవర పరుస్తుంది. ఇప్పటికే బాలీవుడ్, కోలీవుడ్, శాండలవుడ్, టాలీవుడ్ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు పలు సమస్యల వలన కన్ను మూయగా,. తాజాగా తెలుగు చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు, సినీ నిర్మాత బొమ్మరెడ్డి రాఘవ ప్రసాద్ మృతి చెందారు.
గన్నవరం మండలం రాజులపాలెం మాజీ సర్పంచ్, సినీ నిర్మాత, హీరో బొమ్మిరెడ్డి రాఘవ ప్రసాద్(64) అనారోగ్యంతో కన్నుమూశారు. కిరాతకుడు సినిమాలో హీరోగా నటించి స్వయంగా నిర్మించిన ఆయన రూపాయి సినిమాకు ఆయన సహ నిర్మాతగా వ్యవహరించారు. ఆ తర్వాత రాజధాని, సౌర్య చక్ర, దొంగల బండి, బంగారు బుల్లోడు, రంగవల్లి తదితర సినిమాల్లో నటించి నటుడిగా మంచి గుర్తింపు పొందారు. అనారోగ్య సమస్యతో కన్నుమూసారు. ఆయనకు భార్య, ఇద్దరులు కుమారులు ఉన్నారు. నటుడి మృతిపై టాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.