నారాయణపేట టౌన్, జూన్ 4 : కళాకారుల ప్రతిభను వెలికి తీసి వారిని ప్రోత్సహించిన మహోన్నత గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అని మున్సిపల్ వైస్ చైర్మన్ హరినారాయణ భట్టడ్, జెడ్పీటీసీ అంజలి అన్నారు. ఎస్పీ బాలు జయంతి సందర్భంగా శుక్రవారం ఎస్పీ బాలు ఫ్యాన్స్ ఆధ్వర్యంలో పట్టణంలోని బాల కేంద్రంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. జిల్లాలోని సీనియర్ కళాకారులైన టీవీ రేడి యో గాయకులు సంగ నర్సింహులు, శ్రీశైలం, తెలంగాణ పర్ఫార్మింగ్ ఆర్టిస్టుల సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్గౌడ్, గాయని అపర్ణలను పూలమాల, శాలువా, జ్ఞాపికలతో సత్కరించారు. అనంతరం మాట్లాడుతూ బాలు ప్రపంచానికి తెలుగు పాట మాధు ర్యాన్ని చాటి తెలుగోడి గౌరవాన్ని నిలిపారన్నారు. 14 భాషల్లో 40 వేలకు పై గా పాటలను పాడిన బాలుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న ఇవ్వాలని కోరారు. బాలు పాటలను గాయకులు ఆలపించారు. కార్యక్రమంలో బాలు అభిమాన సంఘం జిల్లా అధ్యక్షుడు మహిపాల్రెడ్డి, వసంత్, రామకృష్ణ కల్యాణి, లక్ష్మణ్, ఆంజనేయు లు, శేషప్ప, సువర్ణ, ప్రభాకర్రెడ్డి, నంది ని, శ్రావణి పాల్గొన్నారు.