రిషికేష్, ప్రియాంకశర్మ, మాళవికా సతీషన్ నాయకానాయికలుగా నటిస్తున్న చిత్రం ‘బొమ్మల కొలువు’. సుబ్బు వేదుల దర్శకుడు. ఏ.వి.ఆర్ స్వామి నిర్మాత. ఈ చిత్ర ట్రైలర్ను ఇటీవల రచయితలు కోన వెంకట్, బీవీఎస్ రవి విడుదలచేశారు. అనంతరం కోన వెంకట్ మాట్లాడుతూ ‘సినిమాల పట్ల ఎంతో ఇష్టం, తపన ఉన్న వ్యక్తుల్లో సుబ్బు ఒకరు. ‘రాహు’ సినిమాతో ప్రతిభను చాటిన అతడు ఈ చిత్రంతో దర్శకుడిగా మరో మెట్టు ఎదగాలి’ అని తెలిపారు. దర్శకుడు మాట్లాడుతూ ‘నగరంలో వరుసగా అమ్మాయిలు తప్పిపోతుంటారు. ఈ కిడ్నాప్ల వెనకున్న ముఠాను ఓ యువకుడు ఎలా పట్టుకున్నాడన్నది ఆసక్తికరంగా ఉంటుంది. క్రైమ్ థ్రిల్లర్గా తెరకెక్కించాం’ అని చెప్పారు. ఇందులో తాను రుద్ర అనే పాత్రను పోషించినట్లు రిషికేష్ పేర్కొన్నారు.