బొమన్ ఇరానీ టాలీవుడ్ ప్రేక్షకులకి చాలా సుపరిచితం. అత్తారింటికి దారేది చిత్రంలో పవన్ తాతగా నటించి తెలుగు ప్రేక్షకులకి చాలా దగ్గరయ్యారు. అనేక చిత్రాలలో వైవిధ్యమైన పాత్రలు పోషిస్తున్న బొమన్ ఇరాని ఇప్పుడు ఆయన తనయుడిని దర్శకుడిగా పరిచయం చేయబోతున్నారు. కరణ్ జోహర్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా బొమన్ వారసుడు కయోజ్ ని పరిచయం చేస్తున్నారు. అతని ట్యాలెంట్ ని గుర్తించి కరణ్ డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
కయోజ్ తన తండ్రి బాటలో నడుస్తూ నటుడిగా మారాలని అనుకున్నాడు. కాని ఇప్పుడు దర్శకుడి రూపం ఎత్తాడు. జాన్వీ ప్రధాన పాత్రలో కరణ్ నిర్మాతగా కయోజ్ సినిమా చేయబోతున్నాడు. మోషనల్ రోమ్ కామ్ లో ఈ సినిమా ఉంటుందని తెలుస్తుంది. చిత్రానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఇక జాన్వీ విషయానికి వస్తే ఇటీవలే రూహీ చిత్రంతో ఆకట్టుకుంది. ప్రస్తుతం ధర్మ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న దోస్తానా-2
చిత్రీకరణలో బిజీగా ఉంది. అనివార్య కారణాల వల్ల మళ్లీ దోస్తానా-2 ని రీషూట్ చేస్తున్నారని సమాచారం.