అమరావతి: ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో దారుణం చోటుచేసుకుంది. విశాఖలోని విమ్స్ దవాఖాన పైనుంచి దూకి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆరోగ్యం విషయంలో ఆత్మస్థైర్యం కోల్పోయిన మురిపాల వీరబాబు (37) అనే వ్యక్తి దవాఖాపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు భీమునిపట్నం గొల్లపాలెంకు చెందినవాడినగా గుర్తించారు. అయితే వీరుబాబు ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు చెబుతున్నారు. అయినప్పటికీ ఆత్మ స్థైర్యం కోల్పోయి ఆత్మహత్యకు పాల్పడ్డాడని చెప్పారు.