సుల్తాన్బజార్ ఆర్య సమాజం తొలి మహిళా అధ్యక్షురాలు, ఆర్య కన్య పాఠశాల కరస్పాండెంట్గా సేవలందించిన జయలక్ష్మీదేవీ జీ ఆర్య (90) ఆదివారం అర్ధరాత్రి తమ నివాసంలో కన్నుమూశారు. తమిళనాడులో పుట్టిన ఆమె మహర్షి దయానంద సరస్వతి సాహిత్యాన్ని అధ్యయనం చేసి వైదిక జీవనాన్ని అలవర్చుకున్నారు. స్వాతంత్ర సమరయోధులు, సుప్రసిద్ధ ఆర్య సమాజ్ నాయకులు సత్యనారాయణ ముల్కి కుమారుడు ఘట్కేసర్ గురుకుల స్నాతకులు దేవనాథ్ ఆర్యను వైదిక పద్ధతిలో వివాహం చేసుకున్నారు. వీరి వివాహం అనంతరం మలక్పేట్లోని దయానంద్నగర్లో నివాసం ఏర్పర్చుకున్నారు.
సుల్తాన్బజార్ ఆర్య సమాజ్ తొలి మహిళా అధ్యక్షురాలిగా, దేవీదీన్బాగ్లోని ఆర్య కన్య పాఠశాలకు కరస్పాండెంట్గా సేవలందించారు. ప్రస్తుతం, జయలక్ష్మీదేవీ జీ ఆర్య కుమారుడు సోమనాథ్ ఆర్య కరస్పాండెంట్గా సేవలంది స్తున్నాడు. జయలక్ష్మీ దేవీ జీ ఆర్య సమాజం,ఆర్య కన్య పాఠశాలతో ఎంతో మందికి సేవలందించారని ఆర్య సమాజం, టీఆర్ఎస్ నాయకులు, మాజీ కార్పొరేటర్ ఎంపీ రామచంద్రరాజు ఆమె మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానూభూతిని ప్రకటించారు. మంగళవారం మధ్యాహ్నం జయలక్ష్మీ దేవి పార్థీవ దేహానికి అంబర్పేట్ శ్మశాన వాటికలో అంత్యక్రియలు జరుగుతాయని ఆయన వివరించారు.