టాలీవుడ్ యాక్టర్లు పవన్ కల్యాణ్-రానా కాంబినేషన్ లో అయ్యప్పనుమ్ కొషియుమ్ రీమేక్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఆసక్తికర విషయం ఒకటి ఫిలింనగర్ లో చక్కర్లు కొడుతోంది. రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో స్టోరీ కొనసాగనుందని తెలుస్తోండగా..డైరెక్టర్ సాగర్ చంద్ర ఈ మూవీలో స్పెషల్ ఫ్లాష్బ్యాక్ ఎపిసోడ్ను పెట్టబోతున్నాడన్న వార్త టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది.
ఒరిజినల్ వెర్షన్ లో ఈ పార్టు ఉండదట. రానా, పవన్ కల్యాణ్ కున్న ఇమేజ్ దృష్ట్యా కమర్షియల్ టచ్ కోసం ప్లాష్ బ్యాక్ సీన్లను యాడ్ చేస్తున్నాడట. పింక్ మూవీలో లేని శృతిహాసన్ స్పెషల్ ఎపిసోడ్ను వకీల్ సాబ్ చిత్రంలో పెట్టగా అంతగా వర్కవుట్ కాలేదని చాలా మంది అభిప్రాయపడ్డారు. ఇలాంటి పరిస్థితుల్లో సాగర్ చంద్ర ఫ్లాష్బ్యాక్ ఎపిసోడ్ ఎంత వరకు ప్లస్ అవుతుందనేది చూడాలి.
శ్రీదేవి చిన్న కూతురు టాలీవుడ్ ఎంట్రీ..!
ఓటీటీ ఆఫర్లతో స్టార్ హీరో అప్సెట్..!
రాధేశ్యామ్ టీం మరో పాటను షూట్ చేయనుందా..?
సలార్ లో స్టార్ హీరో భార్య పవర్ ఫుల్ రోల్..?
చిక్కుల్లో కంగనారనౌత్ బాడీగార్డు..!
కృతిశెట్టికి నచ్చని విషయం ఏంటంటే..!
మరో స్పోర్ట్పై కన్నేసిన నాని..!
రూ.22 కోట్ల ఫండ్ రేజ్ చేసిన ప్రియాంక-నిక్ దంపతులు