ముంబై: దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్.. భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) గత ఆర్థిక సంవత్సరం (2020-21) చివరి త్రైమాసికంలో రూ.6,450 కోట్ల నికర లాభం గడించింది. ఈ మేరకు గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం ఆర్థిక ఫలితాలను శుక్రవారం వెల్లడించింది.
ముఖ్యంగా మొండి బకాయిల మీద ప్రొవిజన్లు తగ్గడం ఎస్బీఐకి కలిసి వచ్చింది. ఈ సారి ప్రొవిజన్స్ అండ్ కంటెజెన్సీ ఫండ్కు కేటాయింపులు 18.11శాతం తగ్గాయి. గతేడాది ఇదే సీజన్లో ప్రొవిజన్ల కింద రూ.13,495 కోట్లు కేటాయించగా.. ఈసారి అది రూ.9,914 కోట్లకు పరిమితమైంది.
2020-21 చివరి త్రైమాసికంలో పన్ను చెల్లింపునకు ముందు ఎస్బీఐ లాభం రూ.8,649 కోట్లుగా నిలిచింది. అదే గతేడాది రూ.4,970 కోట్లు మాత్రమే. ఇక బ్యాంక్ నిర్వహణ లాభాల్లో 13.66 శాతం వృద్ధి రేటు నమోదైంది. కంపెనీకి వడ్డీలపై లభించే ఆదాయం పెరిగి రూ.27,067 కోట్లకు చేరింది.
‘మార్చితో ముగిసిన గతేడాది తుది త్రైమాసికంలో కొవిడ్ నిబంధనలు తొలగడంతో రుణ చెల్లింపుదారులకు కొంత ఊరట లభించింది. దీంతోపాటు కోర్టు ఆదేశాల మేరకు రూ.830 కోట్ల మేరకు వడ్డీ సొమ్మును వాపస్ చేశాం’ అని ఎస్బీఐ ఒక ప్రకటనలో పేర్కొంది.
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
జూన్ 1-6 మధ్య ఐటీ వెబ్సైట్ పని చేయదు.. ఎందుకంటే!
ఈ-కామర్స్పై ఫిర్యాదు ఇక సులభం
అహ్మదాబాద్లో కుప్పకూలిన ఐదంతస్థుల భవనం.. వీడియో
సముద్ర పర్యవేక్షణకు ఉపగ్రహాన్ని ప్రయోగించిన చైనా
మార్స్పై ‘మర్మ రాయి’ని కనుగొన్న నాసా రోవర్
ఇక మొబైల్ వాలెట్లు కూడా మార్చుకోవచ్చు.. ఆర్బీఐ సర్క్యులర్ జారీ
కమల్ హాసన్ కు మరో షాక్: ఎంఎన్ఎంను వీడిన కుమార్ వేల్
విజయకాంత్ ఆరోగ్యంపై భిన్న కథనాలు..!
కోవిడ్ పాజిటివ్ పరీక్షలెన్నిరకాలు..? స్టెరాయిడ్స్ ఎందుకు ఇస్తారు?
వ్యాక్సిన్ తయారీ : నూతన ఫార్మా బిలియనీర్లుగా ఎదిగారు!