తమిళంలో థ్రిల్లర్ కథాంశంతో వచ్చిన ధురువంగల్ పథినారు చిత్రాన్ని హిందీలో రీమేక్ చేస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ యువ హీరో వరుణ్ ధావన్ లీడ్ రోల్స్ చేస్తున్నాడు. తాజాగా ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అప్డేట్ ఒకటి బీటౌన్ లో చక్కర్లు కొడుతోంది. మేకర్స్ నేటివిటీకి తగ్గట్టుగా స్క్రీన్ ప్లే ఫార్మాట్ ను సెట్ చేసే పనిలో బిజీగా ఉన్నారట.
ఇంటెన్స్ కాప్ డ్రామాగా రాబోతున్న ఈ చిత్రంలో వరుణ్ ధావన్ వికలాంగుడి పాత్రలో కనిపించనున్నాడట. సాజిద్ నదియావాలా దర్శకత్వం వహించబోతున్నాడు. రీమేక్ సంకి అనే టైటిల్ ను ఖరారు చేసినట్టు సమాచారం. ఈ ఏడాది వరుణ్ ధావన్-సారా అలీఖాన్ కాంబోలో వచ్చిన కూలీ నంబర్ 1 బాక్సాపీస్ వద్ద మిక్స్ డ్ టాక్ తెచ్చుకుంది. తాజా రీమేక్తో ఎలాగైనా హిట్టు కొట్టాలని చూస్తున్నాడు వరుణ్ ధావన్.