యాదాద్రి భువనగిరి : కరోనా మహమ్మారి నుంచి ప్రజలకు విముక్తి కలగాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, సీఎం కేసీఆర్ ఆరోగ్యం త్వరగా కోలుకోవాలని కోరుతూ..యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆలయ అర్చకులు లక్ష పుష్పార్చన కార్యక్రమం చేపట్టారు.
ప్రజలంతా ఆయురారోగ్యాలతో విలసిల్లాలని పూజలు నిర్వహించారు. కాగా, కొండపైన వర్తక సంఘం ఆధ్వర్యంలో ఆలయ ఈఓ గీతా రెడ్డి, ఆలయ అధికారులు, వ్యాపారస్తులతో కలిసి 108 కొబ్బరికాయలను కొట్టారు. అందరూ బాగుండాలని ఆకాంక్షించారు.
ఇవి కూడా చదవండి..
కరోనాతో జూనియర్ అసిస్టెంట్ మృతి
కోతలను బట్టి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి
కేటీఆర్ త్వరగా కోలుకోవాలి : మంత్రి ఐకే రెడ్డి