సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం తర్వాత బాలీవుడ్లో డ్రగ్స్ వ్యవహారం కలకలం రేపుతుంది. రకుల్,దీపికా, సారా అలీఖాన్ వంటి పలువురు ప్రముఖులని కూడా ఈ కేసులోభాగంగా విచారించారు. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) ఇప్పటి వరకు 90కి పైగా కేసులు నమోదు చేసి 275 మందిని అరెస్టు ఎంక్వైరీ చేసినట్లు టాక్.
తాజాగా బాలీవుడ్ నటుడు అర్మాన్ కోహ్లీని ఎన్సీబీ ముంబైలో అరెస్టు చేసింది. శనివానం అతని ఇంట్లో సోదాలు నిర్వహించిన ఎన్సీబీ కొకైన్ గుర్తించింది. దీంతో డ్రగ్స్ ను ముంబై కి ఎవరి ద్వారా చేరిందనే దానిపై ఎన్సీబీ విచారణ జరుపుతోంది. ఈ కేసుతో అంతర్జాతీయ సంబంధాలు ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు.
ఎన్సీబీ అధికారులు డ్రగ్స్ సప్లయిర్స్ అజయ్ రాజ్ సింగ్ ను శనివారం అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. అతడిని విచారిస్తున్నక్రమంలోనే అర్మాన్ కోహ్లీ పేరు బయటకి వచ్చింది. ప్రస్తుతం అతను పోలీస్ కస్టడీలో ఉన్నారు. అర్మాన్ బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటించిన ‘ప్రేమ్ రతన్ ధన్ పాయో’ చిత్రంలో నటించాడు. అలానే సల్మాన్ హోస్ట్ గా చేసిన ‘బిగ్ బాస్’ రియాలిటీ షో లోనూ కోహ్లీ కంటెస్టెంట్ గా పాల్గొన్నాడు