టాలీవుడ్ యంగ్ దర్శకుడు బాబీ అలియాస్ కేఎస్ రవీంద్ర ఈ రోజు 38వ వసంతంలోకి అడుగుపెట్టారు.ఈ సందర్భంగా ఆయనకు ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. త్వరలో బాబీ.. మెగాస్టార్తో క్రేజీ ప్రాజెక్ట్ చేయనున్న విషయం తెలిసిందే.
ఈ రోజు తన పుట్టిన రోజు సందర్భంగా బాబీ ప్రత్యేకంగా చిరు ఇంటికి వెళ్లి ఆయన బ్లెస్సింగ్స్ తీసుకున్నారు. ఆ సమయంలో చిరుతో కలిసి బాబీ దిగిన ఫొటో వైరల్గా మారింది. త్వరలోనే బాబీ- చిరు ప్రాజెక్ట్ షురూ కానున్నట్టు తెలుస్తుండగా, ఇది మల్టీస్టారర్ అని ప్రచారం సాగుతోంది. “ఇది ఓ స్టార్ కీ అభిమానికీ మధ్య జరిగే కథ“ అని బాబీ ఇప్పటికే చిన్న క్లూ ఇవ్వగా, అభిమానిగా ఏ హీరో నటిస్తారనే చర్చ నడుస్తుంది.
బాలీవుడ్ లో ఫ్యాన్
అనే సినిమా వచ్చింది. అదీ స్టార్ కీ అభిమానికీ జరిగే కథే. కాకపోతే… స్టార్ పై అభిమాని తీర్చుకునే రివైంజ్ అది. మరి బాబి ఈసారి ఈ కథని ఎలా డిజైన్ చేశాడో..? చూడాలి మరి..!