న్యూఢిల్లీ : నేపాల్ సరిహద్దు రాష్ట్రాలను సోమవారం భూకంపం తాకింది. బీహార్, అస్సాం, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లోని పట్నా, అరారియా, కృష్ణగంజ్ జిల్లాల్లో రాత్రి 8 గంటల 49 నిమిషాల ప్రాంతంలో ప్రకంపనలు సంభవించాయి.
సిక్కిం-నేపాల్ సరిహద్దులో రిక్టర్ స్కేలుపై ప్రకంపనల తీవ్రత 5.4గా నమోదైంది. ప్రకంపనల కారణంగా ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టం సంభవించ లేదని అధికారులు తెలిపారు.
ఒక్కసారిగా భూమి కంపించడంతో జనాలు ఇండ్ల నుంచి పరుగులు తీశారు.
పిబ్రవరి 15న బీహార్ రాజధాని పట్నాలో భూ ప్రకంపనలు వచ్చాయి. రిక్టర్ స్కేలుపై ప్రకంపనల తీవ్రత 3.5గా నమోదైంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి