సినీ సంగీత ప్రపంచంలో ఎస్పీ బాలుని ధృవతారగా చెప్పొచ్చు.ఆయన గళం నుంచి జాలువారే.. ప్రతిస్వరం ఆ దివిలో విరిసే పారిజాతమే. ఆయన గొంతు నుండి వచ్చిన ఏ గీతమైన శ్రోతలను తప్పక అలరిస్తుంది. బాలుఉ అసలు పేరు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రమణ్యం. 1946 జూన్ 4న నెల్లూరులోని కోనేటమ్మపేటలో జన్మించారు. తెలుగు సినిమా పాటకు ఘంటసాల తరువాత లభించిన ఆణిముత్యం బాలసుబ్రహ్మణ్యం. తెలుగు తో పాటు హిందీ, తమిళం, కన్నడ లాంటి నాలుగు భాషల్లో కలిపి ఆరు సార్లు జాతీయ ఉత్తమ గాయకుడిగా నిలవడం ఒక్క బాలసుబ్రహ్మణ్యానికే చెల్లింది.నాలుగు దశాబ్దాల్లో…11భాషల్లో 40వేల పాటలు పాడి గిన్నీస్ రికార్డు నెలకొల్పిన బాలు కరోనా పోరాడుతూ గతేడాది కన్నుమూసారు. 74 ఏళ్ల వయసులో 2020 సెప్టెంబర్ 24న ఈ లోకాన్ని విడిచి వెళ్లడంతో భారతీయ సినీ సంగీత ప్రపంచంలో ఓ శకం ముగిసినట్టైయింది. ఈ రోజు ఆయన జయంతి సందర్భంగా బాలుతో జ్ఞాపకాలు పంచుకుంటున్నారు.
ఇక కన్నడ సినీ పరిశ్రమ స్థాయినే కాకుండా సౌత్ ఇండస్ట్రీ ఖ్యాతిని నలువైపులా పాకేలా చేసిన దర్శకుడు ప్రశాంత్ నీల్. బంగారు గనుల నేపథ్యంలో కేజీఎఫ్ అనే చిత్రాన్ని తెరకెక్కించిన ప్రశాంత్ నీల్ ఈ సినిమాతో బాక్సాఫీస్ రికార్డులని తిరగరాసాడు. ఓ కన్నడ చిత్రం ఈ రేంజ్ విజయం సాధించడం అదే తొలిసారి. కేజీఎఫ్ చిత్రానికి సీక్వెల్ కూడా చేశాడు ప్రశాంత్ నీల్. కరోనా వలన ఈ మూవీ రిలీజ్ వాయిదా పడింది. ప్రస్తుతం ప్రభాస్తో సలార్ అనే సినిమా చేస్తున్న ప్రశాంత్ నీల్ త్వరలో ఎన్టీఆర్తో ఓ మూవీ చేయనున్నాడు. కన్నడ డైరెక్టర్ అయినప్పటికీ తెలుగోళ్లకు బాగా దగ్గరయ్యాడు. ఈ రోజు ఆయన బర్త్డే సందర్భంగా శుభాకాంక్షల వెల్లువ కురిపిస్తున్నారు.