మహబూబ్ నగర్ : టీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యమని జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. సోమవారం మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల సంజీవయ్య కాలనీ, నల్లకుంటకు చెందిన కాంగ్రెస్ దాదాపు 100 మందికిపైగా నాయకులు, కార్యకర్తలు, మహిళలు, ఎమ్మెల్యే సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. వీరికి గులాబీ కండువాలు కప్పి ఎమ్మెల్యే పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి వివిధ పార్టీలకు చెందిన నాయకులు గులాబీ పార్టీలో చేరుతున్నారని చెప్పారు.
మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులను ఆదరించి అధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర సంగీత, నాటక అకాడమీ చైర్మన్ శివకుమార్, నాయకులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
నేలకొరిగిన సాహితీ శిఖరం : మంత్రి జగదీష్ రెడ్డి
‘వ్యాయామం చేద్దాం..కరోనాను నివారిద్దాం’
వేములవాడలో కరోనాతో అర్చకుడి మృతి
కరోనాతో ఒకే రోజు భార్యభర్తలు మృతి
టీఆర్ఎస్ గెలుపే లక్ష్యంగా ఇంటింటి ప్రచారం