బాలీవుడ్లో బయోపిక్స్ కొత్తేమి కాదు.1999లో కార్గిల్ యుద్ధంలో పాకిస్తాన్ చొరబాటుదారుల నుండి భారత భూభాగాలను తిరిగి స్వాధీనం చేసుకుంటూ దేశ సేవలో ప్రాణాలు అర్పించిన కెప్టెన్ విశాల్ బత్రా జీవిత చరిత్రగా తెరకెక్కిన చిత్రం షేర్షా. ఇందులో సిద్ధార్థ్ మల్హోత్రా ప్రధాన పాత్ర పోషించారు. ఆయన ప్రేయసిగా కియారా నటించింది. విష్ణు వర్ధన్ దర్శకత్వం వహించిన షేర్షా ను ధర్మ ప్రొడక్షన్స్, కాష్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మించారు.
చిత్రంలో ప్రధాన పాత్రధారులతో పాటు కియారాకు తండ్రిగా నటించిన బిజయ్ ఆనంద్పై కూడా ప్రశంసల జల్లు కురుస్తుంది. కియారా తండ్రిగా ఆయన అభినయం అదరగొట్టారు. యువ నిరుద్యోగి, ఆశయం లేని వ్యక్తి అయిన సిద్ధార్థ్ మల్హోత్రాను అతను నిరాకరించే విషయంలో అద్భుతంగా నటించాడు. సర్ధార్ పాత్రలో కియారాపై ఎంతో ప్రేమ గల తండ్రిగా శభాష్ అనిపించుకున్నాడు.
ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్న నేపథ్యంలో స్పందించిన బిజయ్..చాలా సంతోషంగా ఉంది. కళాకారుడు , చిత్రకారుడు, నటుడు ఎవరైన సరే పర్ఫార్మెన్స్ కనబరచినప్పుడు ప్రశంసలు తప్పక వస్తాయి. నటుడికి మంచి ఆదరణ లభిస్తే అంతకన్నా గొప్ప గౌరవం ఏముంటుంది అని ఆయన పేర్కొన్నారు.