బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్. తెలుగులో నాలుగు సీజన్స్ పూర్తి చేసుకున్న ఈ కార్యక్రమం మరి కొద్ది రోజులలో ఐదో సీజన్ జరుపుకోనుంది. కరోనా వలన వాయిదాపడుతూ వస్తున్న ఈ షో సెప్టెంబర్ 5 నుండి ప్రారంభం కానుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. గత సీజన్ కన్నా ఈ సీజన్ని కాస్త డిఫరెంట్గా జరపాలని నిర్వాహకులు భావిస్తున్నట్టు తెలుస్తుంది.
తెలుగు బిగ్ బాస్కి ఇతర భాషల కన్నా మంచి ఆదరణ దక్కుతుంది. నాలుగు సీజన్స్ మంచి హిట్ కావడంతో ఐదో సీజన్ని గ్రాండ్గా లాంచ్ చేయనున్నారట. ఇప్పటికే సెట్ నిర్మాణం, కంటెస్టెంట్ల ఎంపిక పనులు తుది దశకు చేరుకున్నాయి. హోస్ట్గా నాగార్జున లేదా రానా ఉంటారని టాక్. ఇక ఎప్పటి మాదిరిగానే ఈ సారి కూడా బిగ్ బాస్ షోలో పాల్గొనే కంటెంస్టెంట్స్ అంటూ కొందరి పేర్లు బయటకు వచ్చాయి.
యాంకర్ వర్షిణి, యాంకర్ రవి, క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖ వాణి, బుల్లితెర నటి నవ్యస్వామి, యూట్యూబర్ షణ్ముఖ్ జశ్వంత్, హీరోయిన్ ఈషా చావ్లా, యాంకర్ శివ, శేఖర్ మాస్టర్, లోబో, సింగర్ మంగ్లీ, యాంకర్ ప్రత్యూష, టిక్టాక్ స్టార్ దుర్గారావు, బుల్లితెర నటులు సిద్ధార్థ్ వర్మ- విష్ణు ప్రియ జంటల పేర్లు వినిపిస్తున్నాయి. ఇందులో రవి,మంగ్లీ, శేఖర్ మాస్టర్ షోలో పాల్గొనడం కాస్త డౌట్గానే ఉంది.