బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం గత మూడు సీజన్స్ సజావుగానే సాగినప్పటికీ గత ఏడాది, ఈ ఏడాది కరోనా వలన కాస్త ఆలస్యం అవుతుంది.కరోనా సెకండ్ వేవ్ దారుణంగా ఉన్న నేపథ్యంలో షోపై ఇంకా సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. జూలై రెండో వారంలో ప్రారంభం అవుతుందని గతంలో వార్తలు వచ్చాయి. కాని అది కుదరలేదు.తాజా సమాచారం ప్రకారం సెప్టెంబర్ 5 నుండి ఈ షో ప్రారంభం కానున్నట్టు తెలుస్తుంది
బిగ్ బాస్ కంటెస్టెంట్స్కి సంబంధించి ఇప్పటికే జూమ్ ద్వారా ఇంటర్వ్యూలు చేసినట్టు తెలుస్తుండగా, వారందరికి వ్యాక్సినేషన్ పూర్తైన తర్వాత బయోబబుల్ వాతావరణంలో ఉంచనున్నారట.అనేక జాగ్రత్తల నడుమ ఈ షో మొదలు కానుండగా, ఇందులో పాల్గొనే కంటెస్టెంట్స్ వీరే నంటూ ఓ లిస్ట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
షణ్ముఖ్ జశ్వంత్, టిక్టాక్ స్టార్ దుర్గారావు, యాంకర్ వర్షిణి, కమెడియన్ ప్రవీణ్, యాంకర్ శివ, శేఖర్ మాస్టర్, హైపర్ ఆది, సింగర్ మంగ్లీ, ఆ లిస్టులో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో నిజం ఎంతవరకు ఉందో తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సి ఉంది.