హైదరాబాద్ : కేంద్ర పౌర విమానయాన శాఖ కార్యదర్శి ప్రదీప్ సింగ్ ఖరోలా ప్రగతి భవన్లో సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును శనివారం మర్యాద పూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా రాష్ట్రంలోని వరంగల్ జిల్లా మామునూరు, పెద్దపల్లి జిల్లా బసంత్ నగర్, ఆదిలాబాద్ జిల్లాకేంద్రం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ, నిజామాబాద్ జిల్లా జక్రాన్ పల్లి, మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్రలో ఎయిర్ స్ట్రిప్లను సత్వరం మంజూరు చేయాలని సీఎం కేసీఆర్.. ప్రదీప్ సింగ్ ఖరోలాను కోరారు.
స్పందించిన ఆయన ఎయిర్ స్ట్రిప్ల మంజూరుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, రోడ్లు భవనాల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సునీల్ శర్మ, ఈఎన్సీ రవీందర్ రావు తదితరులు పాల్గొన్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి