15 నుంచి ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ
1 నుంచి 19 ఏండ్ల లోపు పిల్లలందరికీ వేయాలి
కొవిడ్ నిబంధనలు పాటిస్తూ మాత్రలు వేయాలి
కలెక్టర్ హరిచందన
నారాయణపేట టౌన్, ఏప్రిల్ 12 : నులిపురుగుల నివారణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ హరిచందన అధికారులను ఆదేశించారు. పట్టణంలోని కలెక్టర్ కార్యాలయ సమావేశపు హాల్లో సోమవారం టెలీ కాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 15 నుంచి 22వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ కార్యక్ర మం చేపడుతున్నామని పేర్కొన్నారు. 1 నుంచి 19 ఏండ్ల లోపు పిల్లలందరికీ ఆల్బెండజోల్ మాత్రలు వేయాలని చె ప్పారు. ఈ వయస్సులో పిల్లలకు నులిపురుగులు ఉన్నట్లయితే రక్తహీనత, సరైన ఎదుగుదల లేకపోవడం, చురుకు గా లేకపోవడం వంటి లక్షణాలతో బాధపడుతారన్నారు. అందువల్ల పిల్లలకు మాత్రలు వేసే విధంగా ప్రణాళికలు రూపొందించుకోవాలని వైద్య, ఆరోగ్య, శిశు సంక్షేమ శాఖ అధికారులకు సూచించారు. ఆశ కార్యకర్తలు, అంగన్వాడీ టీచర్లు ఇంటింటికీ వెళ్లి కొవిడ్ నిబంధనలు పాటిస్తూ మాత్ర లు వేయాలన్నారు. అదే సమయంలో ఇండ్లల్లో ఎవరైనా దగ్గు, జ్వరం వంటి లక్షణాలతో బాధపడుతున్నట్లయితే వా రిని గుర్తించి వెంటనే కరోనా పరీక్షలు చేయించుకునే విధం గా సలహా ఇవ్వాలన్నారు. 45 ఏండ్లు దాటిన వారందరూ టీకా తీసుకునే విధంగా అవగాహన కల్పించి ప్రభుత్వాసుపత్రికి పంపించే విధంగా ఆదేశాలివ్వాలని పేర్కొన్నారు. టె లీ కాన్ఫరెన్స్లో జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ జయచంద్రమోహన్, జిల్లా దవాఖాన సూపరింటెండెంట్ మల్లికార్జున్ పాల్గొన్నారు.