తమిళ హీరో విజయ్ తెలుగులో ఓ స్ట్రైట్ మూవీ చేయనున్నాడని, ఈ చిత్రాన్ని వంశీ పైడిపల్లి తెరకెక్కించనున్నాడని కొన్నాళ్లుగా ప్రచారం నడుస్తుంది. అయితే ఇందులో నిజమెంత ఉందనే దానిపై అభిమానులలో క్లారిటీ లేదు. తాజాగా వంశీ పైడిపల్లి ఓ ఇంటర్వ్యూలో విజయ్ హీరోగా దిల్ రాజు నిర్మాణంలో పాన్ ఇండియా సినిమా చేయబోతున్నట్టు ప్రకటించాడు. కరోనా పాండమిక్ తర్వాత దీనికి సంబంధించి అధికారిక ప్రకటన చేయనున్నాం అని అన్నారు.
ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న వంశీ పైడిపల్లి చిత్రం విజయ్ 65వ సినిమా షూటింగ్ పూర్తైన వెంటనే సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం. గతంలో వంశీ పైడిపల్లి.. మహేష్ బాబు, రామ్ చరణ్తో సినిమాలు చేయాలని ప్రయత్నించగా, అవి సఫలం కాకపోవడంతో డైరెక్ట్ గా విజయ్తోనే సినిమా చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాడు.