బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్గా మారిన ప్రభాస్ ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్ట్స్తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. రాధేశ్యామ్ చిత్ర షూటింగ్ని ఇప్పటికే పూర్తి చేసిన ప్రభాస్ ప్రస్తుతం సలార్, ఆదిపురుష్ చిత్రాలతో బిజీగా ఉన్నాడు. మరి కొద్ది రోజులలో నాగ్ అశ్విన్ చిత్ర షూటింగ్ కూడా మొదలు పెట్టనున్నాడు.
మరోవైపు ప్రభాస్ మరో రెండు ప్రాజెక్టుల విషయంలో కూడా త్వరలోనే ఒక నిర్ణయం తీసుకోబోయే అవకాశం ఉన్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. ప్రశాంత్ నీల్ తో మరో సినిమా చేయాలని అనుకుంటున్న ప్రభాస్ ఆ సినిమాను దిల్ రాజుకు అప్పగించే అవకాశం ఉందట. అలాగే మైత్రి మూవీ మేకర్స్ తో కూడా సినిమా చేయడానికి ఒక కమిట్మెంట్ ఇచ్చిన డార్లింగ్ బాలీవుడ్ సినిమా దర్శకుడు సిద్దార్థ్ ఆనంద్ తో కూడా ఒక సినిమా చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
కొద్ది రోజులుగా ప్రభాస్ 25వ సినిమాపై ఆసక్తికర చర్చలు నడుస్తున్న నేపథ్యంలో అక్టోబర్ 7న బిగ్ అప్డేట్ రానుందని టీ సిరీస్ సంస్థ తెలియజేసింది. ఇది ప్రభాస్ 25వ సినిమాకి సంబంధించిన అప్డేట్ అని తెలుస్తుండగా, ఈ చిత్రాన్ని అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ వంగా తెరకెక్కించనున్నాడట. టీ సిరీస్ నిర్మించనుంది.ఈసినిమాకు దాదాపు ఐదు వందల కోట్ల బడ్జెట్ ను కేటాయించే అవకాశం ఉందట. ఇప్పటి వరకు ఇండియాలో ఏ సినిమా కూడా అంతటి భారీ బడ్జెట్ తో తెరపైకి వచ్చింది లేదు. చూడాలి ఈ వార్తలో ఎంత నిజం ఉందనేది రానున్న రోజులలో తెలియనుంది.