హైదరాబాద్ : గ్రామ పంచాయతీల పరిధిలో ఉన్న పౌల్ట్రీ, డెయిరీ యూనిట్లకు ఇంటి పన్నును మినహాస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేసిందని ఆయన తెలిపారు. గత కొన్ని సంవత్సరాలుగా పౌల్ట్రీ యజమానులు, డెయిరీ యూనిట్ల ఆస్తి పన్నును రద్దు చేయాలని కోరుతున్నారని మంత్రి గుర్తు చేశారు.
వారి వినతిపై సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించి ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. దీంతో రాష్ట్రంలో పౌల్ట్రీ రైతులు ఎంతో లబ్ధిపొందుతారని తెలిపారు. ఆస్తిపై హక్కు పొందడానికి సంవత్సరానికి వంద రూపాయలు చెల్లిస్తే సరిపోతుందని ఆయన తెలిపారు. ఈ నిర్ణయం తీసుకున్న సీఎం కేసీఆర్కు మంత్రి ధన్యవాదాలు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
సోనూ సూద్ను కలిసేందుకు వికారాబాద్ నుంచి ముంబైకి పాదయాత్ర
ఏరువాకను ప్రారభించిన మంత్రి పువ్వాడ
కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన మంత్రి శ్రీనివాస్ గౌడ్
మహిళలు ఆర్థిక సాధికారత సాధించాలి
జగిత్యాలను అభివృద్ధిలో ముందంజలో నిలుపాలి
అయ్యగారిపల్లిలో ఇంట్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు