ముంబై: ఐపీఎల్( IPL )- 2021లో భాగంగా కోల్కతా నైట్ రైడర్స్( Kolkata Knight Riders )తో జరుగుతున్న మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్( Chennai Super Kings ) భారీ స్కోరు చేసింది. రైడర్స్తో పోరులో ఓపెనర్లు డుప్లెసిస్(95 నాటౌట్: 60 బంతుల్లో 9ఫోర్లు, 4సిక్సర్లు), రుతురాజ్ గైక్వాడ్(64: 42 బంతుల్లో 6ఫోర్లు, 4సిక్సర్లు ) వీరవిహారం చేయడంతో 20 ఓవర్లలో చెన్నై 3 వికెట్లకు 220 పరుగులు చేసింది.
చెన్నై ఇన్నింగ్స్లో గైక్వాడ్, డుప్లెసిస్ ఆటే హైలైట్. కోల్కతా బౌలర్లను ఆటాడుకున్న ఈ జోడీ ఫోర్లు, సిక్సర్లతో స్కోరు బోర్డును పరుగెత్తించారు. ఇద్దరూ ఆద్యంతం కళ్లుచెదిరే బ్యాటింగ్తో బౌలర్లపై విరుచుకుపడటంతో అనూహ్య స్కోరు సాధించింది. 35 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకున్న డుప్లెసిస్ చివర్లో విధ్వంసం సృష్టించాడు.
మొయిన్ అలీ(25: 12 బంతుల్లో 2ఫోర్లు, 2సిక్సర్లు), మహేంద్ర సింగ్ ధోనీ(17: 8 బంతుల్లో 2ఫోర్లు, సిక్స్ ) ఫర్వాలేదనిపించారు.కోల్కతా బౌలర్లలో వరుణ్ చక్రవర్తి(1/27) ఒక్కడే పొదుపుగా బౌలింగ్ చేశాడు. నాలుగు ఓవర్లు వేసిన పాట్ కమిన్స్ ఏకంగా 58 పరుగులు సమర్పించుకున్నాడు. ప్రసిధ్ కృష్ణ, ఆండ్రీ రస్సెల్ చెరో వికెట్ తీశారు.