ఎంపీ సంతోష్ కుమార్ శ్రీకారం చుట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. ప్రముఖ బాలీవుడ్ నటుడు, పద్మవిభూషణ్ అమితాబ్ బచ్చన్ ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు. రామోజీఫిలిం సిటీలో జరిగిన ఈ కార్యక్రమంలో బిగ్ బితోపాటు అక్కినేని నాగార్జున, నిర్మాత అశ్వినీదత్, ఫిలిం సిటీ ఎండీ విజయేశ్వరి పాల్గొన్నారు.
ఎంపీ సంతోష్ కుమార్ భావి తరాలకు ఉపయోగపడే మంచి కార్యక్రమం చేపట్టారని ఈ సందర్బంగా అమితాబ్ బచ్చన్ అన్నారు. బిగ్ బీ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్న విషయాన్ని ఎంపీ సంతోష్ కుమార్ ట్విటర్ ద్వారా షేర్ చేశారు. అమితాబ్ బచ్చన్ కు వృక్ష వేదం పుస్తకాన్ని అందజేసి..పుస్తకంలో పొందుపర్చిన అంశాల గురించి వివరించినట్టు ట్వీట్ లో పేర్కొన్నారు ఎంపీ సంతోష్ కుమార్.
ఇవి కూడా చదవండి..
శాకుంతలంలో పాపులర్ టీవీ హోస్ట్
టైగర్ 3..ఎంట్రీ సీన్ కే రూ.10 కోట్లు ఖర్చు..!
కేసు గెలిస్తే కారు నుంచి బైకుకు వచ్చాడు..‘తిమ్మరుసు’ ట్రైలర్
ఆ సీక్రెట్ ముగ్గురికి మాత్రమే తెలుసు: సత్యదేవ్
తరుణ్, ఉదయ్కిరణ్తో నన్ను పోల్చొద్దు: వరుణ్ సందేశ్
ప్రియమణి-ముస్తఫారాజ్ వివాహం చెల్లదు..