మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే ఆచార్య షూటింగ్ పూర్తి చేసిన ఆయన త్వరలో గాడ్ ఫాదర్ షూటింగ్ చేయనున్నాడు. గాడ్ ఫాదర్ చిత్రం మలయాళ మూవీ ‘లూసిఫర్’కి రీమేక్. ఇటీవలే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లింది. మోహన్ రాజా ఈ సినిమాకి దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. ఈ సినిమా తరువాత మెహర్ రమేశ్ దర్శకత్వంలో చిరంజీవి ‘భోళా శంకర్’ సినిమా చేయవలసి ఉంది.
ఈ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుందా అని అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నక్రమంలో మేకర్స్ క్రేజీ అప్డేట్ ఇచ్చారు. నవంబర్ 11న మూవీ పూజా కార్యక్రమాలు జరగనున్నాయని, 15 నుండి షూటింగ్ ప్రారంభం కానుందని తెలియజేశారు. మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో చిరంజీవికి చెల్లెలుగా కీలకపాత్రలో కీర్తి సురేష్ (Keerthy Suresh) నటిస్తున్నారు. కాగా ఈ సినిమాలో హీరోయిన్గా తమన్నా (Tamannaah) ఎంపికైనట్టు సమాచారం. మణిశర్మ తనయుడు స్వర సాగర్ మహతి సంగీతం అందిస్తున్నట్టు వార్తలు వచ్చాయి.
మరోవైపు బాబీ దర్శకత్వంలోను చిరు ఓ సినిమా చేయనున్నారు. ఈ సినిమాకి ‘వాల్తేర్ వీరయ్య’ అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఇది ఏ సినిమాకి రీమేక్ కాదు .. కథ ఇక్కడ పుట్టి పెరిగిందే.దీనిని అద్భుతంగా తెరకెక్కించబోతున్నాడు బాబీ.