కరోనా సెకండ్ వేవ్ వలన ఏప్రిల్ నుండి అన్ని రంగాలు పూర్తిగా స్తంభించిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడిప్పుడే కరోనా తగ్గుతుండడంతో మళ్లీ షూటింగ్స్ ఊపందుకున్నాయి. కొన్ని చోట్ల థియేటర్స్ కూడా తిరిగి తెరచుకుంటున్నాయి. ఈ క్రమంలో తమిళనాట కూడా థియేటర్లకు అనుమతివ్వాలని సీనియర్ దర్శకుడు, తమిళనాడు యాక్టివ్ నిర్మాతల మండలి అధ్యక్షుడు రాజా ముఖ్యమంత్రి స్టాలిన్కు విజ్ఞప్తి చేశారు.
సోమవారం నుండి రాష్ట్ర ప్రభుత్వం సినీ,బుల్లితెర షూటింగ్స్కు అనుమతినివ్వగా ప్రభుత్వం నిర్ణయంపై భారతీ రాజా సంతోషం వ్యక్తం చేశారు. మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడం, తమిళ భాషాభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అభినందనీయం. సినిమా పరిశ్రమ విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ధన్యవాదాలు. తదుపరి సడలింపులో థియేటర్స్కి అనుమతిస్తారని ఆశిస్తున్నాం అని భారతీరాజా పేర్కొన్నారు.