250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్
సెలూన్లు, లాండ్రీలు, ధోబీఘాట్లకు లబ్ధి
ఆదేశించిన సీఎం కేసీఆర్.. జీవో జారీ
ఈనెల నుంచే వర్తింపు
దరఖాస్తులు స్వీకరిస్తున్న విద్యుత్ శాఖ
ఊరూరా సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకాలు
నాగర్కర్నూల్, ఏప్రిల్ 5 (నమస్తే తెలంగాణ) : పేద, బడుగు వర్గాలపై సీఎం కేసీఆర్ తన ప్రేమను మరోసారి చాటుకున్నారు. ఇప్పటికే పలు సంక్షేమ పథకాలను సీఎం కేసీఆర్ అమలు చేస్తూ పేద వర్గాలను ఆర్థికంగా బలోపేతం చేస్తున్నారు. రైతులకు 24 గంటల పాటు ఉచిత విద్యుత్ అందిస్తున్నారు.ఎస్సీ,ఎస్టీలకు 100 యూనిట్లలోపు ఉచిత విద్యుత్ పథకం అమలవుతోంది. ఇదే కోవలో తాజాగా నాయీ బ్రాహ్మణులు, రజకులపై కూడా తన వాత్సల్యాన్ని చాటేలా సెలూన్లు, లాండ్రీలకు 250యూనిట్ల వరకు నాణ్యమైన ఉచిత విద్యుత్ దించేందుకు నిర్ణయించారు.దీంతో ఆ వర్గాల్లోని వేలాది మంది ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.
పేద బడుగు, బలహీన వర్గాల అభివృద్ధి, సంక్షేమ మే లక్ష్యంగా దేశంలో ఎక్కడా లేని పథకాలను సీ ఎం కేసీఆర్ తెలంగాణలో అమలు చేస్తున్నారు. షా దీముబారక్, కల్యాణలక్ష్మితో పేద ఆడపడుచుల పెం డ్లిళ్లకు రూ.లక్ష ఆర్థిక సాయం, ఆసరా పింఛన్లు, బ తుకమ్మ, క్రిస్మస్, రంజాన్ సందర్భంగా పేదలకు దుస్తుల పంపిణీ, రైతులకు రైతుబంధు, రైతుబీమా, మత్స్యకారులకు ఉచితంగా చేపపిల్లలు, గొల్లకురుమలకు గొర్రెల పంపిణీ వంటి పథకాలు అమలవుతున్నాయి. దీంతో ఆర్థికంగా స్థిరత్వం సాధిస్తున్నా రు.
కులమతాలతో సంబంధం లేకుండా పేదల అ భ్యున్నతే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పథకాలను అమ లు చేస్తుండడం విశేషం. రైతులకు నిరంతర ఉచిత విద్యుత్ పథకం విజయవంతంగా అమలవుతున్న ది. ఈ క్రమంలోనే 100 యూనిట్లలోపు బిల్లులు వచ్చే ఎస్సీ, ఎస్టీల గృహాలకు ఉచిత విద్యుత్ అందుతున్నది. ఈ కోవలోనే నాయీబ్రాహ్మణులు, రజకులకు లబ్ధి చేకూరేలా సీఎం కేసీఆర్ నిర్ణయించా రు. గ్రామాలు, పట్టణాల్లో సెలూన్ దుకాణాలు ని ర్వహించే నాయీ బ్రాహ్మణులు, లాండ్రీ షాపులు, ధోబీఘాట్లు నిర్వహించే రజకులకు 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించేందుకు సీఎంవో కార్యదర్శి భూపాల్రెడ్డిని సీఎం ఆదేశించారు. బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం వెంటనే ఉత్తర్వులు విడుదల చేశారు.
దీంతో జిల్లాలోని వే లాది మంది రజక, నాయీబ్రాహ్మణులకు ఆర్థికం గా లాభం చేకూరనున్నది. కులవృత్తిని నమ్ముకున్న ఈ వర్గాల పేదలను ఆదుకోవడమే ఈ పథకం ల క్ష్యం. ఇప్పటికే ఆయా వృత్తిదారులు సంబంధిత వి ద్యుత్ శాఖ అధికారులకు ట్రేడ్ లైసెన్సులతో దరఖాస్తులు చేసుకున్నారు. సీఎం కేసీఆర్ ఆదేశంతో వి ద్యుత్ శాఖాధికారులు దుకాణాలు నిర్వహించే నా యీబ్రాహ్మణులు, రజకుల నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నది. ఈనెల 1వ తేదీ నుంచే పథకం అమలుకానున్నది. దీంతో దరఖాస్తులు చేసుకుని.. 250 యూనిట్లలోపు బిల్లు వచ్చే సెలూన్, లాండ్రీ షాపుల నిర్వాహకులకు మే నెల నుంచి ఉచిత వి ద్యుత్ పథకం వర్తించనున్నది.
షాపులు, డబ్బాలకు కిరాయిలు చెల్లిస్తున్న నాయీబ్రాహ్మణ, రజక వర్గాలకు ఉచిత విద్యుత్ పథకం వరంలా మారడంతోపాటు ఆర్థిక భారం తగ్గనున్నది. కరెంట్ బిల్లులు కట్టనవసరం లేకపోవడంతో ఆర్థికంగా కలిసి రానున్నది. ఇప్పటికే బీసీల కోసం బడ్జెట్లో కేసీఆర్ ఆత్మబంధు పేరిట ఈనెల 27 నుంచి నూతన పథకాన్ని తీసుకొచ్చేందుకు సన్నద్ధమవుతున్నది. ఈ పథకం ద్వారా మేదర, సగర, మత్స్యకార, వడ్డెర, గొల్లకురుమలతో పాటుగా నాయీబ్రాహ్మణ, రజకులకు ఆర్థికంగా చేయూత అందించేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నది. ఉచిత విద్యుత్ పథకం అమలవుతుండటంతో నాయీబ్రాహ్మణ, రజక వర్గాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఊరూరా సీ ఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకాలు నిర్వహి స్తూ సంతోషాన్ని చాటుకుంటున్నారు.
దరఖాస్తులు స్వీకరిస్తున్నాం..
సీఎం కేసీఆర్ ఆదేశాలతో సెలూన్లు, లాండ్రీలు, ధోబీఘాట్లకు 250 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకం ఈ నెల నుంచే అమలుకానున్నది. ఇప్పటికే ట్రేడ్ లెసెన్స్తో కొందరు ఉచిత విద్యుత్ పథకం కోసం దరఖాస్తులు చేసుకున్నారు. ఇంకా అర్హులైన నాయీబ్రాహ్మణ, రజక వృత్తిదారులు విద్యుత్ శాఖ కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలి.
ఇవి కూడా చదవండి
ఆద మరిస్తే అంతే.. తస్మాత్ జాగ్రత్త..
అనుమానాస్పదస్థితిలో బాలుడు మృతి
గడువు ముగిసినా.. తేదీ మార్చెయ్