న్యూఢిల్లీ: అర్థంపర్థం లేని, అక్కెరకురాని ముచ్చట్లతో కరోనా మహమ్మారిని కట్టడి చేయలేమని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ పేర్కొన్నారు. ప్రధాని నరేంద్రమోదీ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ఉద్దేశించి రాహుల్గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు. కొవిడ్పై విజయం సాధించాలంటే చిత్తశుద్ధి, అంకిత భావం, అర్థవంతమైన ప్రణాళిక అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.
అంకిత భావం, చిత్తశుద్ధి, అర్థవంతమైన ప్రణాళిక లేకుండా మన్ కీ బాత్ పేరుతో అక్కెరకురాని ముచ్చట్లు చెప్పడంవల్ల ఏం ప్రయోజనమని రాహుల్గాంధీ ప్రశ్నించారు. ప్రధాని పదవిలో ఉండి ఇలాంటి ముచ్చట్లు చెప్పడం వృథా అని పేర్కొన్నారు. ఇలాంటి పనికిరాని మాటలతో కరోనా మహమ్మారిని నిలువరించలేమని ట్విట్టర్ ద్వారా విమర్శించారు.