ధనుష్ కథానాయకుడిగా మారి సెల్వరాజ్ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం ‘కర్ణన్’ ఇటీవలే విడుదలైన మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ధనుష్ నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. తాజాగా ఈ సినిమా తెలుగు రీమేక్ హక్కుల కోసం ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. తన తనయుడు బెల్లంకొండ సాయిశ్రీనివాస్ కథానాయకుడిగా ఈ చిత్రాన్ని తెలుగులో పునర్నిర్మించనున్నట్లు సమాచారం. తమిళనాడులో జరిగిన యథార్థ సంఘటనల స్ఫూర్తితో ఈ సినిమాను రూపొందించారు.