1970 దశకంలో టైగర్గా వినుతికెక్కిన స్టూవర్ట్పురం ప్రాంతానికి చెందిన గజదొంగ నాగేశ్వరరావు జీవితం వెండితెరపై ఆవిష్కృతం కాబోతున్నది. బెల్లంకొండ సాయిశ్రీనివాస్ టైటిల్ పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి ‘స్టూవర్ట్పురం దొంగ’ అనే పేరును ఖరారు చేశారు. కె.ఎస్ దర్శకుడు. లక్ష్మీనరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై బెల్లంకొండ సురేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బుధవారం టైటిల్ పోస్టర్ను చిత్రబృందం విడుదలచేసింది. నిర్మాత మాట్లాడుతూ ‘1970-80 కాలంలో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్గా పేరుతెచ్చుకున్న నాగేశ్వరరావు జీవితంలోని కీలక ఘట్టాలను ఆవిష్కరిస్తూ రూపొందిస్తున్న చిత్రమిది. జైలు నుంచి అనేకసార్లు తప్పించుకున్న నాగేశ్వరరావు చివరకు 1987లో పోలీసుల కాల్పుల్లో మరణించాడు. ఆ అంశాలను సినిమాలో చూపించబోతున్నాం. నాగేశ్వరరావు పాత్రకు బెల్లంకొండ శ్రీనివాస్ పర్ఫెక్ట్ ఛాయిస్గా కుదిరారు. త్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం’ అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, సినిమాటోగ్రఫీ: శ్యామ్ కె నాయుడు, ఎడిటర్: తమ్మిరాజు, ఆర్ట్: ఏ.ఎస్.ప్రకాష్.