అక్షయ్కుమార్ నటించిన స్పై థ్రిల్లర్ ‘బెల్బాటమ్’ చిత్రాన్ని థియేటర్లలోనే విడుదల చేయాలని దర్శకనిర్మాతలు నిర్ణయించారు. జూలై 27న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులముందుకురానుందని అక్షయ్కుమార్ ట్విట్టర్లో పేర్కొన్నారు. కరోనా రెండో దశ ప్రభావంతో ఈ సినిమా ఓటీటీ ప్లాట్ఫామ్లో విడుదలకానుందని వార్తలొచ్చాయి. ఏప్రిల్ రెండోవారంలో సినిమా రిలీజ్కు ప్లాన్ చేయగా..ఆదే సమయంలో కొవిడ్ సెకండ్వేవ్ విజృంభణతో సినిమాను వాయిదా వేశారు. ఫ్యాన్సీ ఆఫర్లు రావడంతో ఈ సినిమా ఓటీటీ ప్లాట్ఫామ్లోనే విడుదలవుతుందని బాలీవుడ్లో వినిపించింది. తాజాగా ముంబయిలో కరోనా తగ్గుముఖం పట్టడం..మహారాష్ట్ర ప్రభుత్వం కొన్ని ఏరియాల్లో యాభైశాతం ఆక్యుపెన్సీతో సినిమాల ప్రదర్శనకు అనుమతినివ్వడంతో ‘బెల్బాటమ్’ చిత్రం థియేటర్ రిలీజ్కు సిద్ధమైంది. 1980దశకం నేపథ్యంలో గూఢచారి కథతో ఈ సినిమాను రూపొందించారు. రంజిత్ ఎమ్ తివారి దర్శకత్వం వహించారు.