రాశీ ఖన్నా..ఈ భామ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. తెలుగులో ఇప్పటికే తనకంటూ స్పెషల్ క్రేజ్ సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. ఊహలు గుసగుసలాడే సినిమాతో ఎంట్రీ ఇచ్చి.. అందరి ఊహల్లోకి వచ్చేసింది రాశీ ఖన్నా. అప్పట్నుంచి ఇప్పటి వరకు వరస సినిమాలు చేస్తూనే ఉంది. అయితే కోరుకున్నట్లు స్టార్ హీరోయిన్ మాత్రం కాలేకపోయింది. మధ్యలో జూనియర్ ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోతో జై లవకుశలో నటించింది కూడా. అయినా కానీ ఎందుకో మరి రాశీకి స్టార్ ఇమేజ్ రాలేదు. స్టార్ హీరోలతో ఈమెకు సినిమాలు పడలేదు.
గోపీచంద్, రామ్, నాగ చైతన్య, సాయి ధరమ్ తేజ్ లాంటి యంగ్ జనరేషన్ తప్ప స్టార్ హీరోలు ఎంకరేజ్ చేయలేదు. మధ్యలో రవితేజతో రెండు సినిమాలు చేసింది కానీ అక్కడా నిరాశే ఎదురైంది. అయితే మీడియం బడ్జెట్ సినిమాలకు మాత్రం రాశీ ఖన్నా బెటర్ ఆప్షన్ అయింది.ఇప్పటికీ కుర్ర హీరోలకు మంచి జోడీగా మారింది రాశీ. గతేడాది విజయ్ దేవరకొండ వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలో అదిరిపోయే అందాల ఆరబోతతో పాటు బోల్డ్ సీన్స్ కూడా చేసింది రాశీ.
ఇదిలా ఉంటే ఇన్నాళ్లూ ఒక లెక్క.. ఇప్పుడు ఒక లెక్క అన్నట్లు మారిపోయింది రాశీ. ఇప్పట్నుంచి మాస్ బిర్యానీ పెట్టడానికి రెడీ అయిపోయింది. అర్థం కాలేదు కదా.. పక్కా మాస్ సినిమాల వైపు అడుగులు వేస్తుంది ఈ బ్యూటీ. ఇకపై అలాంటి కథల్లోనే ఎక్కువగా కనిపించాలని లెక్కలు వేసుకుంటుంది. క్లాస్ కారెక్టర్స్ తోనే ఇప్పటి వరకు గుర్తింపు తెచ్చుకుంది ఈ బ్యూటీ. ఇప్పుడు మాస్ అందాలతో పిచ్చెక్కించాలని డిసైడ్ అయిపోయింది.
మారుతి దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా నటిస్తున్న పక్కా కమర్షియల్ సినిమాలో రాశీ ఖన్నా పాత్ర చాలా మాసీగా ఉంటుందని తెలుస్తుంది. ఇప్పటి వరకు ఈమె చేయని పాత్ర అది. దాంతో పాటు రవితేజ హీరోగా త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో చేస్తున్న సినిమాలో కూడా రాశీ పక్కా మాస్ రోల్ చేయబోతుందని తెలుస్తుంది. ఇదివరకే రవితేజతో బెంగాల్ టైగర్, టచ్ చేసి చూడు సినిమాల్లో నటించింది ఈ బ్యూటీ. ఇప్పుడు మూడోసారి జోడీ కట్టబోతుంది. మరోవైపు గోపీచంద్ తోనూ జిల్, ఆక్సీజన్ సినిమాల్లో నటించింది రాశీ. మరి ఈ భామ వడ్డించబోయే మాస్ బిర్యానీ ఎలా ఉండబోతుందో చూడాలి.